Loading...

29, ఆగస్టు 2011, సోమవారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
--------శంకరంబాడి సుందరాచారి.

తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు !

13, ఆగస్టు 2011, శనివారం

జో శహీద్ హువే హై ఉన్ కీ జరా యాద్ కరో కుర్బానీ(కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.)



తెలుగులో , హిందీ లో చదవండి. వినడానికి ఇక్కడ నొక్కండి.
తెలుగు భావం చదవండి

 యె మేరే వతన్ కే లోగోం!
తుమ్ ఖూబ్ లగా లో నారా
యే శుభ్ దిన్ హై హమ్ సబ్ కా
లహరా లో తిరంగా ప్యారా
పర్ మత్ భూలో సీమా పర్
వీరోంనె హై ప్రాణ్ గంవాయె
 కుఛ్ యాద్ ఉన్హే భీ కర్ లో - 2
జో లౌట్ కె ఘర్ నా ఆయె-2

 యె మేరే వతన్ కే లోగోం!
జరా ఆంఖ్ మే భర్ లో పానీ
జో  శహీద్ హువే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ ఘాయల్ హువా హిమాలయ్
ఖత్ రే మే పడీ ఆజాదీ
జబ్ తక్ థీ సాంస్ లడే వో
ఫిర్ అప్ నీ లాశ్ బిఛాదీ
సంగీన్ పే ధర్ కర్ మాథా
సో గయే అమర్ బలిదానీ
 జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ దేశ్ మే థీ దివాలీ
వో ఖేల్ రహే థే హోలీ
 జబ్ హమ్ బైఠే థే ఘరోం మే
వో ఝేల్ రహే థే గోలీ
 థే ధన్య జవాన్ వో అప్ నే
 థీ ధన్య వో ఉన్ కీ జవానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

కోయీ సిఖ్ కోయీ జాఠ్ మరాఠా
కోయీ గురఖా కోయీ మదరాసీ
సరహద్ పె మర్ నేవాలా
హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్
వో ఖూన్ థా హిందూస్థానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

థీ ఖోన్ సె లథ్ పథ్ కాయా
ఫిర్ భీ బందూక్ ఉఠాకే
దస్ దస్ కో ఏక్ నే మారా
ఫిర్ గిర్ గయే హోష్ గంవా కే
జబ్ అంత్ సమయ్ ఆయా తో
కహ్ గయే కి అబ్ మర్ తే హై
ఖుష్ రహ్ నా దేశ్ కే ప్యారోం
అబ్ హమ్ తో సఫర్ కర్ తే  హై
క్యా లోగ్ థే వో దీవానే
క్యా లోగ్ థే వో అభిమానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

తుమ్ భూల్ న జావో ఉన్ కో
ఇస్ లియే కహీ యే కహానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ
జయ హింద్ జయహింద్ కీ సేనా
జయ హింద్ జయ హింద్ జయ హింద్!!!

భావం ---------

నా దేశ ప్రజలారా!
నినదించండి, ఈవేళ  మనందరికీ శుభదినం. మువ్వన్నె ల జెండా ఎగరేయండి
కానీ హద్దుల్ని కాపాడుతూ ప్రాణాలను బలి ఇచ్చిన వీరులను కూడా స్మరించండి. వారిక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదని మరువకండి.

నా దేశ ప్రజలారా!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
హిమాలయాలు గాయపడినపుడు, మన వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కలిగినపుడు ఊపిరున్నంతవరకూ పోరాడారు వాళ్ళు. ఆ తరువాత తాము శవాలయ్యారు. తమ శిరస్సుమీద తుపాకీ మొన గురి పెట్టబడి ఉందని తెలిసి పోరాడి అమరులయ్యారు.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.

నా దేశ ప్రజలారా!
దేశమంతా దివాలీ జరుపుకుంటుంటే వారు రక్తపు హోలీ ఆడారు.
మనమంతా దేశం లోపల భద్రంగా ఉంటే వాళ్ళు తుపాకీ గుండ్లతో ఆడారు.
మన సేనలు,వారి సమర్థత ధన్యం చెందాయి.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
సిఖ్ఖులు, జాట్ లు, మరాఠీలు, గుర్ఖాలు, మదరాసీలు, సరిహద్దుల్లో ప్రాణాలు వదిలినవారంతా ఎవరైతేనేం---భారతీయులు. ఆ కొండల మీద చిందిన రక్తం భారతీయులది.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
దేహం మొత్తం  తుపాకీ గుండ్లతో రక్తసిక్తమైనా సరే తుపాకీలు గురి పెట్టి ఒక్కొక్కరు పది మంది  శత్రువులనైనా చంపే అసువులు బాశారు.
మేం లోకం వదిలేస్తున్నాం, నా ప్రియమైన దేశవాసులారా! సంతోషంగా జీవించండి అని చెప్పి మనకు వీడ్కోలిచ్చారు.
ఎంత ఆత్మాభిమానం, ఎంత పట్టుదల !!!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
వారిని మనం మరవకూడదనే ఈ కథ!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
జయ జయ హిందూదేశం! జయ జయ హిందూ దేశం!!!








5, ఆగస్టు 2011, శుక్రవారం

నాగుల చవితి


శ్రావణమాసం శుద్ధ చవితి మేము నాగుల చవితి గా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో కార్తీకమాసంలో జరుపుకుంటారని తెలుసు.
నాగుల చవితికి మిగతా పండుగల్లాగా సున్నాలవీ పూయకూడదు.
ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు.
ఇల్లు తుడిచాక ముగ్గుపిండి తో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు/చాక్ పీసులతో పెట్టాలి.
మొత్తానికి నాగులకు, ఏ కీటకానికీ ఏ హాని, పొరబాటుగానైనా, కనీసం ఆ వేళనైనా జరగకూడదు.
ఇదీ సంప్రదాయం. అన్ని గుమ్మాలకీ/తలుపులకీ ఆస్తీక అని వ్రాయాలి.
ఆస్తీకుడు ఎవరంటే--------------
అర్జునుని కొడుకు అభిమన్యుడు
అభిమన్యుడు యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి
అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు
పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు
అనాలోచితం గా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాము వలన మరణిస్తాడు
తండ్రి మరణానికి ఖేదం చెందిన జనమేజయుడు పాముజాతిని అంతటినీ మట్టుపెట్టే ఒక గొప్ప సర్పయాగాన్ని నిర్వహిస్తాడు.
యాగ మధ్యలో సర్పజాతిని రక్షించటానికి (వాతావరణ చక్రభ్రమణానికి అన్ని ప్రాణుల అవసరమూ ఉంది) వస్తాడు
తన మాటలచాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగం ఆపి జగత్కల్యాణకారకుడౌతాడు ఆస్తీకుడు
అందుకే నాగులచవితి నాడు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని రాసి సర్పజాతిని కాపాడినవాడిని అభినందనాపూర్వకంగా తలచుకొనడం జరుగుతుంది.

ఇక ఆనాడు అందరూ తలస్నానం చేసి నాగదేవతకు పాలు పోస్తారు. పల్లెల్లో అయితే పొలాల్లో పుట్టలు ఉంటాయి.అక్కడికే వెళ్ళి పాలు పోస్తారు. పూజలు చేస్తారు. ఆ అవకాశం లేకపోతే ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని, పాలు పోసి, పూజచేసి, నూల ఉంటలు, చలిమిడి నైవేద్యం పెడతారు. కొందరు రోజంతా ఉపవాసం ఉండి పూజిస్తారు.

నూల ఉంటలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి. 

చలిమిడి - బియ్యప్పిండి లో మెత్తటి బెల్లపు పొడి కలిపి ఉండలు కడతారు. నూల ఉంట రుచి ముందు అదేం పనికి రాదు. అయినా ప్రసాదం కదా , తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కూడా.

ఇప్పుడు నూల ఉండలు చాలా ఇష్టం. పండుగ కాకపోయినా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను.
నాగుల చవితి రోజు చెప్పుకోవాల్సిన కథ కూడా ఒకటుంది. అది ఇంకోరోజు రాస్తాను. :-)