Loading...

24, మార్చి 2020, మంగళవారం

అయోమయం..

పెను విపత్తు ముంచుకొచ్చిందనుకున్నాం.
అంతలోనే ఒక దేశం అగ్ర దేశంగా మారడానికి చేస్తున్న కుట్ర అనీ,
కార్పొరేట్ ప్రపంచం పెను ఉత్పాతాలను సృష్టించిందనీ,  ప్రతీ సారీ ఒక కాలావధి అనంతరం తన ఆధిపత్యం షేక్ కాకుండా చూసుకోడానికి ఆర్థిక స్థితులను అతలాకుతలం చేస్తూ, సరిచేస్తూ ఉండడం ఇలా ఎన్నో సార్లు జరిగిందనీ ఇదీ అదేననీ
ఎన్నో ఊహాగానాలు ఎన్నో వివరణలతో ప్రచారం పొందుతున్నాయి.
ఇవేవీ నిజాలనడానికి ఏ ఆధారం లేదు.

ఏదిఏమైనా ప్రకృతి లో అందరూ అన్నీ సుఖంగా ఉండాలని మనుష్యులు అనుకోరు అన్నది మాటిమాటికీ ఋజువవుతోంది.🙁😑😶

22, మార్చి 2020, ఆదివారం

గంటలు కొట్టాం!!!


ప్రతీరంగంలో అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే అందరికీ మా కృతజ్ఞతలు తెలిపాము. ☺️👏
మా వీధిలో ముందు మేమే మొదలుపెట్టాం. చాలామంది వెంటనే రెస్పాండ్ అయ్యారు. బయటకు, బాల్కనీలకు వచ్చి గంటలు కొట్టారు శంఖారావం చేశారు . రోడ్ మీద నడిచేవాళ్ళు, ఆగినవాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు, పిల్లలంతా ఇంకా ఉత్సాహం చూపించారు.
----
గమనికలు
1. మోదీ మీద భక్తి తో ఈ పని చేయలేదు.
2. ట్రైన్స్ టికెట్స్ కొన్ని ఆటోమేటిగ్గా కాన్సిల్ అయ్యాయి. ఫ్లైట్ టికెట్స్ డేట్ మార్చుకున్నాము.
3. ఇంతటితో కరోనా గొలుసు తెగిందనీ, చప్పట్లు/గంటలు వైరస్ ను చంపేస్తాయనే మూఢనమ్మకాలను నమ్మము.
పబ్లిసిటీ కోసం కాక ఇంకా ఎంతో మందికి తెలీడం లేదని మాత్రమే ఇదంతా వ్రాస్తున్నాను.
---
  ఇది మంచిపనే గానీ , సిల్లీ పని కాదని నా ఉద్దేశ్యం. అందుకే పెట్టా.
అందరూ అన్ని సేవలూ డబ్బులు తీసుకొనే చేస్తారు. అందులో సందేహం లేదు.
అందరం ఒక్కొక్కసారి ఆ సేవల్లో ఇబ్బందులు, కష్టాలు , నష్టాలు, ఎదురుదెబ్బలు, మోసాలు ఎదుర్కొన్నవాళ్ళమే.
అయినా సరే, అవసరానికి సహాయం అందించిన ఎన్నో రంగాల వారికి థాంక్స్ గివింగ్ అనేది మన దేశంలో కూడా ఒక సంప్రదాయంగా మారితే తప్పు లేదు. మంచి అలవాటు.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.

12, మార్చి 2020, గురువారం

పాత గోడ- కొత్త గోడ

'నలుగురూ నాలుగురకాలుగా ..' అనే దరిద్రమైన ఫోబియా ఆనాటి సమాజం మాత్రమే సృష్టించిందనుకుంటే పొరబాటు.
అదే దరిద్రమైన ఫోబియా నేటి మీడియా/సోషల్ మీడియా కూడా సృష్టిస్తోంది.
చదువు, వ్యక్తిత్వాలు, వికాసాలు చాలా పెరిగాయనీ, విదేశీ భావాల ఎక్స్ పోజర్ వల్ల మన సమాజపు పాతకాలపు 'జడ్జ్ మెంటల్' బిహేవియర్ మారిందనీ చెప్పుకోవడం గొప్పలకు మాత్రమే.
అప్పుడు ఆ గోడల దగ్గరా, అరుగుల మీదా జరిగే పంచాయతీలు, జడ్జ్ మెంటల్ మాటలు, ఇప్పుడు ఈ గోడల దగ్గరా, 'ఛా'నల్స్ లోనూ జరుగుతూనే ఉన్నాయి.
నాగరికతలూ, ఆధునిక భావాలు వట్టి ఎండమావులే. కనిపించి మాయమయ్యేవే. ఏ కాలపు సమాజాలైనా అవే బురదలో దొర్లుతుంటాయి.

3, మార్చి 2020, మంగళవారం

మానసిక వ్యాధి స్థాయిలో ఆచారమూఢత్వము

చిత్రంలోని అంశాలు: 'దంపతుల్ని మింగేసిన 'మడి' పద్ధతులు భరించలేక భార్యను చంపి... భర్త ఆత్మహత్య మెసూరు, న్యూస్టుడే: ఆమెకు మడి. ఏ పనిచేసినా శుచిగా, శుభరంగా ఉండాలి. తనతోపాటు ఇంటిల్లిపాదీ అలాగే ఉండాలనేది ఆమె పట్టు. అదే ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. కర్ణాటక మైసూరు జిల్లా మండహర్లిలో ఈ చోటుచేసుకుంది. (40) ర్తలు. వీరికి 15 సంవత్సరాల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బయటి వస్తే... స్నానం చేశాక గానీ లోప లికి అనుమతించేవారు మార్లు చేయాల్సి వచ్చేది. నుంచి వచ్చాక బడి సంచుల్ని నీటితో ప్రోక్షణ చేసేవారు. తొలి నాళ్లల్లో పుట్టమణి పద్దతులు, సంప్రదాయలను ఎలాగోలా భరించినా ఇటీవలి 'మడి' ప్రతిమించిందని భర్త ఆవేదనకు లోనయ్యాడు. నేపధ్యంలో మంగళవారం కలిసి కట్టెల్ని తీసుకొచ్చేందుకు లోని అడవికి తీసుకెళ్లి ఆమెను మార్చాడు. అనంతరం తానూ ఉరివేసుకుని తీసుకొచ్చి, చేసుకున్నాడు.' అని చెప్పే సంభావ్య వచనం



https://www.vijayavani.net/man-killed-his-wife-in-nanjanagoodu/
నా సర్కిల్ లో పూర్తి ప్రతిరోజూ మడి పాటించేవారూ ఉన్నారు, పూర్తి లిబరల్ గా ఉండే వారూ ఉన్నారు. అటువంటప్పుడు ఇది ఏమిటి? ఎంత లిమిట్ వరకూ? పరమార్థమేమిటి? తనవరకూ పాటించడం, అవతలి వారిని ఇబ్బంది పెట్టేవరకూ వెళ్ళడం ఈ రెండింటి మీద ఉండే గీత సన్నదనం ఎంత? ఇటువంటి విషయాలలో నాలో ఎంతో ఘర్షణ ఉంది. ఈ మధ్య ఎవరికి వారు తమ లిమిట్స్ తెలుసుకోవడం, తాము పాటిస్తున్న నిష్ఠలోతుపాతుల గురించి తెలిసి ఉండడం ముఖ్యమన్న ఒక నిష్కర్షకు వచ్చాను. కానీ ఆ నిష్కర్ష విషయంలో కూడా మూర్ఖపు పట్టు లేదు. ఆ నమ్మకాల విషయంలో నా గౌరవం పెరిగేలా ఏమన్నా తెలిస్తే నాకూ సంతోషమే. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ లేక frustrated గా ఉండి పెట్టిన పోస్ట్.