Loading...

3, మార్చి 2018, శనివారం

ఈశాన్యం

            వాస్తునిర్మాణంలో ఈశాన్య ప్రాధాన్యత తో పోలుస్తూ, గౌ. ప్రధాని చమత్కరించినా,
ఈ నలభై యాభై ఏళ్ళ కాలంలో ఈశాన్య రాజ్యాలలో దేశసమగ్రత పరంగా బలమైన స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వాలు లేకపోవడం వల్ల దేశమంతటిపై ప్రభావం చూపే విధంగా ప్రక్కనున్న చైనా దురాలోచనలు మనందరమూ చూస్తూనే ఉన్నాము. దేశానికి వాయువ్యంగా ఏర్పడిన పాకిస్తాన్ కవ్వింపులు ఒక ప్రక్కనుండగా ఈశాన్య మూలనుంచి చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటుండడాన్ని అడ్డుకోవాలంటే దేశం పట్ల అంకిత భావం ఉన్న పార్టీల చేతిలో ప్రభుత్వం ఉండితీరాలి.
         అక్షరశః ప్రాణాల పై ఆశ వదలుకొని పనిచేసిన కార్యకర్తలకు, నేరుగా పోరాడలేక హత్యలకు పాల్పడే శత్రుపక్షాల దుర్మార్గాలకు అంతమైన కార్యకర్తలకు ఈ విజయం ఒక బహుమానం.
       మోసపూరిత మతాంతరీకరణలకు స్థానిక ప్రజలు గురికాకుండా,
, తమదైన ఆచారవ్యవహారాలపై  నాగరీకులమనిపించుకుంటున్న వారి దౌర్జన్యాలకు బలికాకుండా ఈశాన్యరాజ్యాలు రక్షింపబడాలని కోరుకుందాం.

     ప్రతి శనివారం ఉదయం 7.30 కు ఈశాన్య రాజ్యాలపై కార్యక్రమాలను దూరదర్శన్ చూపిస్తూ ఉంటుంది. అక్కడి ప్రజల జీవన విధానాలు- సంస్కారాలు, అలవాట్లు, భోజనాదులు,  కలుపుగోలుతనాలు, పనిపాటలు, ఆటపాటలు, జానపదుల నృత్యాలు,  నైపుణ్యాలు, నిరాడంబరత అన్నీ మన ఇక్కడి పల్లెల్లో లాగానే ఉంటాయి.
          వారి వేషధారణ, ముఖాకృతుల్లో తేడా ఉండవచ్చు. అది అంతా భౌగోళిక పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుందని మనకు తెలిసినదే.
          ఇక్కడి కూచిపూడి, ఆంధ్రనృత్యం, పేరిణి లాగా అక్కడి మణిపురి నృత్యకళలో కృష్ణునిపై కీర్తనలకు లాలిత్యమైన అంగవిన్యాసంతో సాగే మృదువైన నాట్యము కొంచెము మోహినీ ఆట్టంలోని లాలిత్యాన్ని తలపిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి