Loading...

15, జూన్ 2022, బుధవారం

ప్రాయోపవేశాలు

 

పలు సందర్భాల్లో కావ్యాల్లో ప్రాయోపవేశాలు లేదా తత్సంబంధమైన ఆలోచనలు కనిపిస్తాయి. చాలా గుణగణాలు గలిగిన, స్థితప్రజ్ఞులైన నాయికానాయకులు, ఇతర ప్రముఖ పాత్రలు కూడా మినహాయింపు కాదు. ఆ యా శోక,దుఃఖభరితమైన సందర్భాలలో లేదా ఇక జీవించి ఉండాల్సిన అవసరం లేదు అని నిశ్చయించుకొని చేసిన ఆలోచనలు, పనులవి. అలా ఎందుకు చేశారని లేదా వ్రాశారని విమర్శలు లేవు కూడా.
కానీ మధ్యకాలాలలో ఆత్మహత్య మహాపాపమనే వాదన ఎలా ప్రబలింది? చట్టపరంగా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినవారికి శిక్షలు ఎందుకు ఉన్నాయి? ఈ చట్టాలైతే విదేశీ అనుకరణలై ఉండొచ్చు. కానీ జనాలు కూడా నమ్ముతున్నారు ఇది పాపమని. అదెలా? అంత దుర్భరమైన పరిస్థితిలో జీవించి ఉండి ఆత్మను, శరీరాన్ని వేదనకు గురి చేయడం మాత్రం మహాపాపం ఎందుకవదు?
చచ్చి సాధించేదేమీ లేదు, బ్రతికుండి సాధించాలి అని నాకు తెలుసు. నేను నమ్మి గౌరవించి, ఆచరించే సిద్ధాంతం అదే. కాకపోతే మొదటి పేరాలో ఉన్నది అందరికీ తెలిసిందే. అది చూస్తున్నప్పుడు, రెండో పేరాలో వ్రాసిందంతా ఇదొక ఆధునిక మూఢనమ్మకమా అని ఆలోచన కలిగినందువల్లనే.
ప్రశ్న - ప్రాయోపవేశాలను తప్పుగా చూడనపుడు ఆత్మహత్యలను ఎందుకు చూస్తాము అని.
ఇవి ప్రాయోపవేశాలప్పుడు వర్తించవు అని చెప్పడానికి లేదు. కానీ అవి విమర్శకు కూడా గురైనట్టు లేదు.
గమనిక - వీటిలో నేను యతులు సమాధికావడాన్ని చేర్చడం లేదు. శోక,దుఃఖ,భయాది ఆవేశాలకు లోనై చేసిన ప్రాయోపవేశాల గురించి మాత్రమే చెప్తున్నాను.
సీత అపహరణమైనాక ఒకటి రెండు సార్లు అనుకుంటుంది. హనుమంతుడు అన్వేషణలో విఫలమైనప్పుడు అనుకుంటాడు. దుర్యోధనుడు ఓటమి నిశ్చయమైనప్పుడు అనుకుంటాడు. అంబ అనుకుంటుంది. వేదవతి, సతీదేవి చేస్తారు. భరతుడు కూడా నేమో. రాముడు, లక్ష్మణుడు చేసేది అవతారం చాలించాలని కాబట్టి అది ఉద్వేగంతో కూడినది కాదు. పైవన్నీ ఉద్వేగాలకు లోనై అనుకున్నవే. ఇంకా ఇతర ఉదాహరణలు కూడా ఉండొచ్చు. అదేపనిగా చూడలేదు. చదివినట్టు గుర్తు.
ప్రాయోపవేశాలు లేదా తత్సంబంధమైన ఆలోచనలు రెండూ నా ప్రశ్నలో భాగమే.
వ్యాఖ్యాతలెవరూ సమర్థించలేదు. కాకపోతే వ్యతిరేకత&ఖండన చూపి విమర్శించలేదు అంతేకాక సాధారణ జనంలో వ్యతిరేకత&ఖండన లేదు.
ఖండించాలనడం నా ఉద్దేశ్యం కాదు. అందుకే పేర్లను వద్దని పోస్ట్ లో చెప్పలేదు. తర్వాత చేర్చా. ప్రాణిమాత్రులకు అనేక స్వభావాలుంటాయి. అరుస్తున్న కుక్కను చూసి భయపడేవాళ్ళుంటారు, ఎదుర్కొనే వాళ్ళుంటారు, పట్టించుకోకుండా సాగిపోయేవాళ్ళుంటారు. తమకు దుర్భరమనిపించిన జీవితాన్ని చూసి కూడా ఇలా రకరకాలుగా రియాక్ట్ అయ్యే వాళ్ళుంటారు. నా ఉద్దేశ్యంలో ఆత్మహత్య పిరికితనమే. కాకపోతే పిరికివాళ్ళు కూడా ఉంటారు. మనం ఆపగలిగితే ఆపొచ్చు. లేనప్పుడు హేళన చేయడమో, అరెస్ట్ చేయడమో అనవసరం.
పూర్వులు ఆ పని చేయలేదు. అంటే పురాణాలను వ్యాఖ్యానం చేసినవారు ఖండన, హేళన, శిక్ష ఉండాలనలేదు. చేయలేదు. వ్యక్తిగతమైన అనేక స్వేచ్చాయుత నిర్ణయాలకు, సమాజాన్ని ఎదిరించి నిలిచే ప్రవర్తనకు పూర్వ రచనలలో ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడున్నన్ని పిచ్చి కట్టుబాట్లు, భ్రమలు అప్పుడు లేవు. మధ్యలో వచ్చాయేమో. వారే నాగరికులు నన్నడిగితే. ఇప్పుడున్నవారే ఆటవికులు.
సమస్యలను పురాణాల్లో వెదకలేదు. అప్పుడు సమస్యగానే భావించలేదు. మరి ఇప్పుడు ఎందుకిలా జడ్జ్ చేస్తున్నాం అని. నేను కూడా ఆ జడ్జ్ చేసే గుంపులోని దాన్నే.
భరించలేని స్థితిలో ప్రస్తుతం చాలా మటుకు అది నేరంగా చూస్తున్నారు. అందుకే వెనక్కి చూశా.
వేరే మతాల గురించి అవగాహన లేదు కాబట్టి మాట్లాడను.
అంగీకారం పెరుగుతుందో లేదో తెలీదు. మెర్సీ కిల్లింగ్ పక్షం వహించి  కూడా కొన్ని చర్చలూ, కొన్ని కోర్టు కేసులూ ఉన్నాయి.
yes, justifiable in some cases.
అన్నిటికీ ఒకే చూపు, ఒకే తీర్పు కాకుండా పరిస్థితిని బట్టి పోయే మనఃస్థితి అయినా ఉంటే మంచిది.
కానీ ఇది చాలా complicated. ఆ స్థితికి ఫలానా ఇతరులు తీసుకొచ్చారనే వాదనలున్న కేసులూ ఉంటాయి.
యోగుల సజీవసమాధులు, మహాప్రస్థానాలు ఈ ప్రశ్నలో అంటే ఈ సందేహంలో లేవు.
ఆధ్యాత్మికకోణం లేని వైయక్తిక ఉద్వేగాలకు లోనైన ప్రాయోపవేశాలను మాత్రమే ప్రస్తావించాను.
 
నావరకూ నేను చెప్పుకున్న సమాధానమేమంటే -
నాటి రచనల ద్వారా మనకు పరిచయమైన సమాజాల్లో సమాజం వ్యక్తి కన్నా ఎక్కువ ప్రాముఖ్యత గలిగినది. ఇప్పటికీ అలాగే ఉన్నా, ఆలోచనల, అభిప్రాయాల వరకూ వ్యక్తి స్వేచ్ఛ , వ్యక్తి ప్రాముఖ్యత సమాజం కన్నా ఎక్కువ అనే కారణం వల్లనూ,
అప్పటికన్నా ఇప్పుడు పెరిగిన సమాచార సౌలభ్యం, ఆయుధ సౌకర్యం, సమాజం/ఎదుటివ్యక్తులతో కలిసి మెలగగల ఒద్దిక నశించడం వంటి వాటివల్లనూ
ఇప్పుడు ఈ రకమైన ధోరణి మరింత ప్రమాదకారి కాగలదు. కాబట్టి నేటి ఈ పరిస్థితిలో పాపమని, నేరమని వ్యక్తులు అంగీకరించడమే మంచిది.