Loading...

27, ఆగస్టు 2017, ఆదివారం

తల్లీపిల్లలు

వాల్మీకి రామాయణములో కౌసల్య, కైకేయి రామ వనగమన సమయంలో భావోద్వేగాలకు గురి అవడం కనిపిస్తుంది.
కౌసల్యా సుతుడైన రామయ్య , కైకేయి పుత్రుడు భరతుడు ధర్మాగ్రహం మాత్రమే చెందుతారు.
కానీ సుమిత్ర ఎప్పుడూ పరమ శాంతంగా ఉంటుంది.
శాంతమూర్తి అయిన సుమిత్ర తనయులిరువురూ కూడా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తొందరపాటుతో, ఉద్వేగంతో ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇది వింత కాకపోవచ్చు కానీ ఇందులో తెలుసుకోవలసిన సూక్ష్మం ఏమైనా ఉందేమో నని అడుగుతున్నాను.